అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఏ ఐ ఎఫ్ డి ఎస్ జిల్లా ప్రథమ మహాసభలో ఉచిత విద్య వైద్యం కోసం ఉద్యమించాలని రాష్ట్ర కార్యదర్శి డక్క కుమార్ పిలుపునిచ్చారు. ఉరవకొండ లో నిర్వహించిన ప్రథమ మహాసభ విజయవంతంగా నిర్వహించామని విద్యార్థుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాటాలను సాగించామని పేర్కొన్నారు ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా జీవోలు విడుదల చేసి విద్యాసంస్థల్లో సమస్యలను పరిష్కరించే వీలు లేకుండా విద్యార్థి సంఘాలను నిర్వీర్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. జీవోలపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది ఈ సందర్భంగా పేర్కొన్నారు.