ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి సాయినగర్ వెస్ట్ కాలనీలో ఒక వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. రాజేశ్వరి వృద్ధాశ్రమం సమీపంలో నివసిస్తున్న అరవింద్పై అతని భార్య తమ్ముడు, మరో వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యారు. కుటుంబ కలహాలే ఘర్షణకు కారణమని జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపారు. గాయపడిన అరవింద్ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.