శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండల పరిధిలోని తవలం, గందోడివారిపల్లి గ్రామాలలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజల చేత సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమానికి ప్రజాదరణ పెరుగుతోందని వైఎస్ఆర్సిపి నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.