ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభ పోస్టర్ను రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో గురువారం ఒంగోలు ఎంసీఏ భవన్ లో ఆవిష్కరణ చేశారు .అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రాష్ట్ర కార్యదర్శి గోపి మాట్లాడుతూ ఎంతో విశిష్టమైన 2025 వ సంవత్సరంలో ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభలను టంగుటూరి ప్రకాశం పంతులు పుట్టిన నేలపై జరపపోవడానికి ఎంతో ఆనందిస్తున్నామన్నారు. డిసెంబర్ 19 ,20 ,21 తేదీలలో ఒంగోలు నగరంలో మూడు రోజులపాటు రాష్ట్ర మహాసభలు జరుగుతాయని తెలియజేశారు ఇందులో రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన డెలిగేట్స్ అందరూ హాజరవుతారని తెలియజేశారు