చైనా మాంజ పట్టిస్తే రూ.5 వేలు ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజా కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. తన నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజాను విక్రయిస్తే ఉపేక్షించమని చెప్పారు. ఏ షాపులోనైనా అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచి, రూ.5 వేలు ఇస్తామన్నారు.