ఒంగోలులోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 20వ తేదీన జరిగిన చోరీని ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు DSP శ్రీనివాసరావు తెలిపారు. ఒంగోలులోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం డీఎస్పీ మాట్లాడుతూ.. సంతపేట సాయిబాబా గుడి వెనక గల గృహంలో అర్ధరాత్రి తలుపును పగలగొట్టి చోరీకి పాల్పడ్డ ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వీరివద్ద రూ.20 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.