చంద్రశేఖరపురం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రశేఖరపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ మందుబాబులను హెచ్చరించారు. బుధవారం చంద్రశేఖరపురంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని గుర్తించిన ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ వారి చేత మద్యం సేవించిన ప్రాంతాలను శుభ్రం చేయించారు .వారు తాగిపడేసిన మద్యం సీసాలను వారి చేత ధ్వంసం చేయించారు. అనంతరం వాటిని తగలబెట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయక్ మాట్లాడుతూ.... చంద్రశేఖరపురం మండలంలో ఎక్కడైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.