వేసవి దృష్ట్యా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని జిల్లా అధికారులు ఆదేశించిన కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Apr 6, 2026
ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలను వడగాల్పుల పట్ల అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలు ఎండ తీవ్రతకు గురికాకుండా చేపట్టవలసిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రస్తుత వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఎండ తీవ్రతపై తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర అంశాలపై జిల్లా సమీక్షించారు