నగరంలో రాజధానికి చట్టబద్ధతపై అంబరాన్నంటిన సంబరాలు : ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
అనంతపురం నగరంలో రాజధానికి చట్టబద్ధతపై అంబరాన్నంటిన సంబరాలు.డప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి సందడి చేశారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతికి చట్టబద్ధత లభించడంపై కూటమి పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న, మంత్రి పయ్యావుల, టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటి, బిజెపి జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నగరంలోని టవర్ క్లాక్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీ సాగినది.