స్క్రబ్ టైఫస్ జ్వరాలపై గ్రామీణ ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి ఆదేశాల మేరకు శుక్రవారం గడి గ్రామం లో జరిగే వారపు సంతలో 104 సేవలలో భాగంగా మేడికుర్తి పీ. హెచ్. సి. డాక్టర్ కావ్య గంధ ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ రైతులకు, ప్రజలకు స్క్రబ్ టైపస్ వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1610 కేసులు నమోదు అయి 11మంది చనిపోయారని అన్నారు