మంత్రాలయం: సీఎం సహాయ నిధి కుల,మత ,ప్రాంత భేదం లేకుండా అందజేస్తున్నాం : మంత్రాలయం నియోజవర్గ ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి
మంత్రాలయం: మాధవరం టీడీపీ కార్యాలయంలో మంగళవారం నియోజవర్గ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత ఏడో విడతగా రూ.8,36,310 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ సహాయ నిధిని కుల, మత, ప్రాంత భేదం లేకుండా అందిస్తున్నామని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల టిడిపి అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.