ఒంగోలు అర్బన్: జీజీహెచ్ ఒంగోలులో అత్యాధునిక లేజర్ విధానంతో కిడ్నీ రాళ్లకు విజయవంతమైన చికిత్స
Ongole Urban, Prakasam | Jul 7, 2026
ఒంగోలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల యూరాలజీ సూపర్ స్పెషాలిటీ విభాగంలో అత్యాధునిక లేజర్ హోల్మియం లేజర్ సాంకేతికతతో కిడ్నీ రాళ్లకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఏస్. మాణిక్యరావు తెలిపారు. ఆసుపత్రికి ఇటీవల అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక లేజర్ యంత్రాలు, అవసరమైన పరికరాల సహాయంతో కిడ్నీ రాళ్లకు కోత లేకుండా, తక్కువ రక్తస్రావంతో, అత్యంత సురక్షితంగా లేజర్ చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా యూరాలజిస్ట్ డా. కిరణ్ కుమార్ నాయకత్వంలోని వైద్య బృందం ఆపరేషన్ విజయవంతంగా చేసినట్టు చెప్పారు