నంద్యాల అర్బన్: ఆంధ్రజ్యోతి కార్యాలయాల పై వైసీపీ నాయకుల దాడిని ఖండించిన టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్
Nandyal Urban, Nandyal | Apr 8, 2026
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై వైసీపీ నాయకులు చేస్తున్న దాడిని నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ తీవ్రంగా ఖండించారు బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ నాయకులు గతంలో కూడా దాడులు నిర్వహించారని వారు గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడి చేయడం సిగ్గుచేటని విమర్శించారు