అనంతపురం అర్బన్: సుద్ధపట్లపల్లి వద్ద సైకిల్ ను ఢీకొన్న కారు ఇద్దరికీ గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 23, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల పరిధిలోని సుద్దభట్ల పల్లి వద్ద సైకిల్ ను కారు ఢీకొన్న ఘటనలో తుమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంజనప్పతోపాటు మారుతీ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అంజనప్ప ను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.