ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై సంజయ్ సావంత్ గుండెపోటుతో మరణించారు. పంచాయతీ ఎన్నికల విధులకు హాజరు కావలసి ఉండటంతో మంగళవారం రాత్రి ఆయన పోలీస్ స్టేషన్ లోనే నిద్రించారు. ఈ క్రమంలో ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. నాచారంలో నివాసం ఉండే సంజయ్ సావంత్ బుధవారం అబ్దుల్లాపూర్ మెట్రో ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉంది. ఎస్సై మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.