అనంతపురం జిల్లా కొర్రపాడు వద్ద రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వ్యక్తికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 10, 2026
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో పొరపాటు గ్రామానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.