సంగారెడ్డి: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నారాయణఖేడ్ సబ్ కలెక్టర్లు దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.