సంతనూతలపాడు మండలం కామేవారి పల్లిలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త సేకరణ జరుగుతున్న విధానాన్ని పరిశీలించి, గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్తలను సేకరించి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ... గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యవద్దని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని గ్రామస్తులను హెచ్చరించారు. చెత్త రహిత గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు.