నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు పల్లపు రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి బాధిత నివాసానికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.