కౌతాళం :మండలం ఉరుకుందలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ ఈరన్న స్వామి దర్శనార్థం వచ్చిన రాయచూరుకు చెందిన భక్తుల గోల్డ్ డాలర్ దేవస్థానం గదుల దగ్గర పడిపోయిందని ఈవో వాణికి ఫోన్ ద్వారా బాధితులు తెలిపారు. వెంటనే కార్యనిర్వహణాధికారి స్పందించి అక్కడికి 5 మంది ప్రత్యేక సిబ్బందిని పంపి వెతికించారు. సదరు డాలర్ను ఈవో వాణి మంగళవారం భక్తులకు అందజేశారు.