ఇంటి స్థలం విషయంపై అన్నదమ్ములు ఘర్షణ ఇద్దరికి గాయాలు
అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం సానిపాయ కృష్ణమయ్య గారి పల్లెలో బుధవారం మధ్యాహ్నం అన్నదమ్ములు ఇంటి విషయంపై ఘర్షణకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో చిన్నప్ప, వెంకటయ్య ఇద్దరు అన్నదమ్ములు తీవ్రంగా గాయపడ్డారు. ఇంతకుముందు వీరబల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై సమక్షంలో పంచాయితీ జరిగిందని బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.