పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల ఎంపీడీఓ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం బెళుగుప్ప ఉన్నత పాఠశాలను meo-2 హరికృష్ణ తో కలసి సందర్శించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని పదవ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించాలని ఎంపీడీవో ఎంఈవోలు స్థానిక హెచ్ఎం వెంకటప్రసాద్ కు ఉపాధ్యాయులకు సూచించారు.