ఒంగోలు అర్బన్: చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాలు : వైసిపి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Ongole Urban, Prakasam | Jun 2, 2026
చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచి రెండు సంవత్సరాల అయిందంటూ వైసిపి జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు తాను మారిపోయానని తనకు ఒకసారి అవకాశం ఇస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతంలో మామను పొడిచినట్లే ప్రజలను వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు ఆ వెన్నుపోటుకు నేటికీ రెండు సంవత్సరాలు అన్నారు పథకాల అమలు నేటికీ సరిగా లేదంటూ పథకాలను వివరిస్తూ ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎండగట్టారు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన కూటమి పార్టీపై నిప్పులు చెరిగారు.