గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. శనివారం సాయంత్రం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం తదితర ప్రజాప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. గ్రూప్-2లో ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు ఆయన నియామకపత్రాలు అందజేశారు.