మెట్పల్లి: మెట్ పల్లి పట్టణంలోని పలు వాటర్ ఫ్లాంట్ లను పరిశీలించిన మునిసిపల్ ఇంచార్జు సానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్
నాణ్యమైన తాగునీరు అందించకపోతే అలాగే ఐఎస్ఐ మార్కు లేకుండా నీటిని అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ గుర్రం రత్నాకర్ గురువారం అన్నారు.ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పట్టణంలోని పలు వాటర్ ఫ్లాంట్ లను ఆయన పరిశీలించారు.ఐఎస్ ఐ మార్క్ లేకుండా నీటిని విక్రయిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.