డోన్ లో మార్నింగ్ వాక్ లో పాల్గొన్న మాజీ మంత్రి బుగ్గన, ప్రజలతో మాటామంతి
Dhone, Nandyal | Apr 21, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని నెహ్రూ నగర్ పార్కులో మంగళవారం ఉదయం మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి నడిచారు. వారితో ఆత్మీయంగా ముచ్చటించి ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యకర్తలు వెల్లడించిన అభిప్రాయాలను ఆయన శ్రద్ధగా విన్నారు.