రాచర్ల మండలం రామాపురం గ్రామానికి చెందిన ప్రభావతి అనే మహిళ గిద్దలూరులో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే ఒక 50 మంది తన ఇంటికి వచ్చి పొలానికి సంబంధించిన రోడ్డు విషయంలో తనను బెదిరించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ప్రభుత్వంలో తమకు రక్షణ లేదని దినదిన గండంతో భయపడుతున్నట్లు తెలిపారు. పోలీసులు కూడా ఫోను చేసే స్పందించలేదని మహిళ చెబుతున్న వీడియో ఆదివారం మధ్యాహ్నం వైరల్ గా మారింది.