అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట వద్ద శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పాపంపేట భూ సమస్యలపై ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత చుట్టూ కొంతమంది దయ్యాలు భూతాలు చేరుకున్నాయని, వారి వల్ల పరిటాల సునీతకు చెడ్డపేరు వస్తుందని ఇప్పటికైనా పరిటాల సునీత మేలుకొని ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ బహిరంగ సభలో పరిటాల సునీతకు పలు సూచనలు చేశారు.ఈ సమావేశంలో స్థానిక ప్రజలు పాపంపేట సిపిఐ నేతలు పాల్గొన్నారు.