డోన్: రంగాపురంలో రెండు గడ్డివాములు దగ్ధం
Dhone, Nandyal | May 23, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం రంగాపురంలో పులగుమ్మి మనోహర్కు చెందిన 2 గడ్డి వాములు శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న డోన్ అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్ చేరుకొని సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేశారు. రూ.1.20 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు మనోహర్ తెలిపాడు.