ఆళ్లగడ్డ: ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఆర్టీసీ సంస్థ కు అప్పజెప్పాలి ఆళ్లగడ్డ డిపో ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకుడు రాజశేఖర్
ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను ఆర్టీసీ సంస్థ కు అప్పజెప్పాలని ఆళ్లగడ్డ డిపో ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు, మంగళవారం ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ధర్నా చేపట్టారు, ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో ఉద్యోగుల జేఏసీ సంఘం నాయకుడు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణను పినాకిల్ అనే సంస్థకు అప్పగించడం సరికాదన్నారు, ఆర్టీసీ డ్రైవర్లు ఎంతో నైపుణ్యం గలవారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు