పాణ్యం: ఉపాధి హామీ చట్ట సవరణలు వ్యవసాయ కార్మికులకు నష్టం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చడం, చట్టంలో వ్యవసాయ కార్మికులకు నష్టం కలిగించే సవరణలు చేయడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి.నాగన్న మండిపడ్డారు. మంగళవారం కేతవరం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ ఉపాధి చట్ట సవరణ బిల్లులను తగలబెట్టారు. గ్రామీణ పేదల వలసలు, విద్యా–ఆరోగ్య సమస్యలకు కేంద్రం బాధ్యత వహించాలని, కుటుంబానికి 200 రోజులు పని, రూ.600 కూలి ఇవ్వాలని డిమాండ్ చేశారు.