కర్నాటక లోని అంతర రాష్ట్ర జలాశయం తుంగభద్ర డ్యాంకు గతంలో ఉన్న పాత గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. గేట్ నెంబర్ 18 పాత గేటు స్థానంలో కొత్త గేటును సోమవారం విజయవంతంగా అమర్చడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్ హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ప్రాజెక్టులకు పెద్ద పేట వేసింది అనడానికి ఇదొక ఉదాహరణ పేర్కొన్నారు. మరోవైపు తుంగభద్ర ఎగువకాలువ ఆయకట్టు దారులైన బొమ్మనహాల్, డి.హిరేహాల్, కణేకల్లు మండలాల రైతులు సంతోషం వ్యక్తం చేశారు