కడప: అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్కు అహ్వానం
Kadapa, YSR | Oct 30, 2025 అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి,వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్కు అహ్వానం అందింది.ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  కడప అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ కలిసి ఆహ్వానం అందజేశారు.నవంబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ ఈ ఉర్సు మహోత్సవాలు జరుగుతున్నాయని.. ఈ ఉత్సవాలకు హజరుకావాలని వైయస్ జగన్ను కోరారు!