అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెలుగుప్ప కూడేరు విడపనకల్లు వజ్రకరూరు ఉరవకొండ మండలాల్లోని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా బుధవారం నిర్వహించారు. బెలుగుప్ప మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ్ దుర్గం ఆర్డీవో వసంత బాబు స్థానిక తహసిల్దార్ అనిల్ కుమార్, టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున, నాయకులు పెద్ద తిప్పయ్య కలిసి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుక కార్యక్రమంలో పాల్గొని భారత రాజ్యాంగ ప్రవేశికతో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిటి మధుసూదన్ ఈ సర్వే డీటీ గురుబ్రహ్మ ఆర్ఐ నగేష్, వీఆర్వోలు వీఆర్ఏలు పాల్గొన్నారు.