కార్మిక కర్షక భవన్లో సిఐటియు 18వ అఖిలభారత మహాసభల నేపథ్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నగర అధ్యక్షులు నగేష్ అధ్యక్షతన జిల్లా నాయకులు పిఎస్ రాధాకృష్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఐక్యత–పోరాటం నినాదంతో వీధివీధిన జెండాలు ఎగురవేస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కార్మికులు మరింత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.