పాణ్యం: 18వ అఖిలభారత మహాసభల జయప్రదానికి వాడవాడలా సిఐటియు జెండా ఆవిష్కరణలు
కార్మిక కర్షక భవన్లో సిఐటియు 18వ అఖిలభారత మహాసభల నేపథ్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నగర అధ్యక్షులు నగేష్ అధ్యక్షతన జిల్లా నాయకులు పిఎస్ రాధాకృష్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఐక్యత–పోరాటం నినాదంతో వీధివీధిన జెండాలు ఎగురవేస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్మిక హక్కులను హరించే లేబర్ కోడ్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, కార్మికులు మరింత ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.