జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ వివాదంపై ఎమ్మార్వో విచారణ ముగిసింది. ఇరువర్గాలను శేరిలింగంపల్లి ఎమ్మార్వో విచారించారు. ఈ సందర్భంగా కోర్టు ఇచ్చిన డైవర్స్ డిస్మిస్ జడ్జిమెంట్ కాపీని మాలిని దేవి తరపు న్యాయవాది ఆంటోనీ ఎమ్మార్వోకు అందజేశారు. అనంతరం తదుపరి విచారణ డిసెంబర్ 6కు ఎమ్మార్వో వాయిదా వేసినట్లుగా సమాచారం.