విద్యుత్ షాక్ తగలడంతో పెయింటింగ్ కార్మికుడికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | Apr 18, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేంద్రంలో పెయింటింగ్ పనులు చేసుకుంటున్నా కార్మికుడు ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురయ్యాడు. దీంతో అతనిని శనివారం రాత్రి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరిస్థితి అత్యంత విషయంగా ఉందని వైద్యులు తెలిపారు.