సత్య సాయి జిల్లా రామగిరి మండల కేంద్రంలో స్థానిక ఎస్సై ప్రదీప్ బాంబులు నిర్వీర్యం చేసే ప్రత్యేక నిపుణులతో కలిసి నాటుబాంబులను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామగిరి ఎస్సై ప్రదీప్ తెలిపిన సమాచారం మేరకు రామగిరి పోలీస్ స్టేషన్ నందు ఓల్డ్ పోలీస్ స్టేషన్ వద్ద నాటుబాంబులను ప్రత్యేక నిపుణులతో కలిసి నాటు బాంబులు పనిచేయకుండా నిర్వీర్యం చేయడం జరిగిందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాటుబాంబులను నిర్వీర్యం చేశామని రామగిరి ఎస్సై ప్రదీప్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.