బనగానపల్లె: జూన్ 24 నుంచి పాలీసెట్ కౌన్సిలింగ్: బనగానపల్లె పాలిటెక్నిక్ కళాశాల రమణారెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లె వాసవి పాలిటెక్నికల్ కళాశాలలో ఈనెల 24 నుంచి 29 తేదీ వరకు పాలిసెట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ జి.వి రమణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఓసి,బిసి విద్యార్థులు రూ.700, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రూ 250 చొప్పున కౌన్సిలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.