ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో ప్రసిద్ధి ఆలయం పంపునూరు సుబ్రమణ్య స్వామి వారి దేవస్థానంలో ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి 8:30 గంటల వరకు సుబ్రమణ్య స్వామి వారి దేవస్థానంలో కార్తీకమాసం నాలుగో శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు అర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సీతారామ్మోహన్ శర్మ, ఆలయ అధికారి బాబు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు హోమాలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా మంగళవారం రోజున కార్తీకమాసాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు నిర్వహించే 101 ప్రదక్షలను భక్తులకు రద్దు చేయడం జరిగిందని సీతా రామ్మోహన్ శర్మ, బాబు పేర్కొన్నారు.