అనంతపురం అర్బన్: కుమ్మర వాండ్ల పల్లిలో భారీ పేలుడు నలుగురు మృతి 12 మందికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం కదిరి మండలంలోని కుమ్మర వాండ్లపల్లి గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న పేలుడు ఆ గ్రామంలో విషాదం నింపింది. ఏకంగా నలుగురు మృతిచెందగా 12 మందికి తీవ్ర గాయాలైనట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.