చీమకుర్తి: విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరుగు సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు ఆంజనేయులు పిలుపునిచ్చారు. చీమకుర్తి పట్టణంలోని సివిల్ సప్లై గోడౌన్ లో పనిచేస్తున్న కార్మికులతో శనివారం ఆంజనేయులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక కార్మిక సంస్థ సిఐటియు మాత్రమేనన్నారు. సిఐటియు అఖిలభారత మహాసభలకు కార్మికులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.