కనిగిరి: నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: జనసేన పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి నాగరాజు
కనిగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వరి కూటి నాగరాజు సూచించారు. కనిగిరి పట్టణంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. కార్యక్రమానికి హాజరైన నాగరాజు మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి బలపడేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జనసేన నేత దేవకి వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.