అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో బుధవారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో డైరెక్టర్ ఆఫ్ వాల్యువేషన్ నాగప్రసాద్ నాయుడు ఫార్మసీ డి అక్టోబర్ సెప్టెంబర్ నెలలో నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగప్రసాద్ నాయుడు మాట్లాడుతూ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఫార్మసీ డి నాలుగవ సంవత్సరం రెగ్యులర్ సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను ఐదవ సంవత్సరం రెగ్యులర్ సప్లమెంటరీ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ వాల్యూవేషన్ ఆచారి నాగప్రసాద్ నాయుడు పేర్కొన్నారు.