చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు- ఎర్రగుడిపాడు మధ్య ముది గొండ వాగులో విద్యార్థి గల్లంతైన విషయంలో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజాబాబు తెలిపారు.కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ముది గొండ వాగు దాటే ప్రయత్నం చేసిన మైనంపాడు TTC కాలేజీ విద్యార్థి అరవింద్ గల్లంతయ్యాడు. కాగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు వద్ద ఇన్ఛార్జ్లుగా VRO, VRAలను ఉంచారు. వారు అప్పుడే భోజనానికి వెళ్లగా వాగు దాటేందుకు ప్రయత్నించిన విద్యార్థి గళ్లంతయ్యాడు. దీంతో ఆ ఉద్యోగులను సస్పెండ్ చేశామని కలెక్టర్ తెలిపారు.