ఒంగోలు అర్బన్: నీట్ పరీక్షకు ఒంగోలులో 197 మంది గైర్హాజరు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహణ
Ongole Urban, Prakasam | Jun 21, 2026
పత్రికా ప్రకటన ఒంగోలు ( 21.6.2026 ) మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ' నీట్ ' పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఒంగోలు నగరంలోని 6 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. దీనికోసం మొత్తం 1821 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 1624 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. 197 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని సౌకర్యాలను కల్పించారు. భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా స్వయంగా జిల్లా ఎస్పీ శ్రీ.వి.హర్షవర్ధన్ రాజు అన్ని సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలించారు.