బనగానపల్లె: మద్యం సేవించి ట్రాక్టర్ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు శిక్ష : నందివర్గం ఎస్ఐ భూపాలుడు
మద్యం సేవించి ట్రాక్టర్ నడిపిన వ్యక్తికి న్యాయస్థానం 20 రోజుల జైలు శిక్ష విధించినట్లు నందివర్గం ఎస్ఐ భూపాలుడు పేర్కొన్నారు. పలుకూరు గ్రామ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో బోయ రమేశ్ అనే వ్యక్తి తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతనిపై కేసు నమోదు చేసి బనగానపల్లె కోర్టులో హాజరుపరచగా, విచారణ అనంతరం కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.