శంకర్పల్లి మండలం పర్వేద గ్రామానికి చెందిన ఓ రైతు విద్యుత్ షాక్తో మృతి చెందాడు. పుడుగుర్తి సాయిబాబా (48), 30 గుంటల్లో గులాబీ తోట సాగు చేస్తున్న నేపథ్యంలో శనివారం రాత్రి పూలతోటకు నీరు పెట్టారు. ఈ క్రమంలో మోటర్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్కు గురవ్వడంతో హుటాహుటిన అతడిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు రైతు మృతి చెందినట్లు నిర్ధారించారు