బనగానపల్లె: బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన
నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారంసుడిగాలి పర్యటన నిర్వహించారు. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్డు విస్తరణ వల్ల షాపులు కోల్పోయిన బాధితుల కోసం చేపట్టిన పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. పనులు వేగవంతం చేసి బాధితులకు సకాలంలో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. షాదీఖానా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.