వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బిగిస్తున్న ఉచ్చు
Nandyal Urban, Nandyal | May 20, 2026
వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల జిల్లా వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈనెల 14న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగిన YCP కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఫార్మా కంపెనీ నుంచి రూ.45 కోట్ల ముడుపులు తీసుకున్నారని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు పరువునష్టం కలిగించాయని మంత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బైరెడ్డి ఆరోపణలను మీరు సమర్థిస్తున్నారా? కామెంట్ చేయండి.